Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ స్థాయిలోని అంగన్వాడీ కేంద్రాలను బచ్పన్ సెంటర్లుగా మార్చి ఎల్కేజీ, యూకేజీ విద్యను పిల్లలకు అందించాలని కార్మిక, ఉపాధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం నాడు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, బాలల హక్కుల గురించి చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను నవీకరించాలని, శాఖకు సంబంధించిన అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం కావాలసిన నిధులు ప్రభుత్వం ద్వారా, పారిశ్రామిక వేత్తల, సేవా కార్యక్రమాలు నిర్వహించే వారి నుంచి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్డర్ విజయేంద్ర బోయి, జువైనల్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ, మహిళా, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.