Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 132మంది నుంచి డబ్బులు వసూలు
- ఐపీ పెట్టిన మహిళ
- మంచిర్యాల డీసీపీకి బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ - మంచిర్యాల
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళ 132 మందిని నమ్మించి నట్టేటా ముంచింది. చివరకు డబ్బులు తిరిగిస్తానంటూ తిప్పుకుని ఐపీ పెట్టింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం బాధితులు డీసీపీ రక్షితా కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లికి చెందిన సుమలత గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మబలికింది. ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.5 లక్షలు వసూలు చేసింది. ఇలా మొత్తం 132 మంది నుంచి దాదాపు రూ.10 కోట్లు వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు ఆమెను ఒత్తిడి చేశారు. దీంతో మీ డబ్బులు మీకిస్తానని చెప్పి వారికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చింది. తరువాత సుమలత కోర్టును ఆశ్రయించి ఐపీ తెచ్చుకొని బాధితులకు నోటీసు పంపింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మంచిర్యాల డీసీపీ రక్షిత కె.మూర్తికి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదును బెల్లంపల్లి సీఐకి పంపుతూ డీసీపీ విచారణకు ఆదేశించారు.