Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం
- ఉపాధిని కల్పించే కోర్సులు ప్రవేశపెట్టాలి: గవర్నర్
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాలు సామాజిక బాధ్యతతో పనిచేయాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఓయూ 80వ స్నాతకోత్సవం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి నుంచీ ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగి.. యూనివర్సిటీన్నింటిలోనూ రారాజుగా కొనసాగుతోందని చెప్పారు. అందువల్ల విద్యార్థులకు ఉపాధి కల్పించే సామర్థ్యం గల కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని గవర్నర్ కోరారు. విద్యార్థులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచించారు. ఓయూ పూర్వ విద్యార్థి ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మనదేశం పట్టభద్రులతో అభివద్ధి చెందిన దేశంగా మారాలని ఆకాంక్షించారు. వందేండ్ల చరిత్ర కల్గిన యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రసంగించటం అదష్టంగా భావిస్తున్నట్టు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డా.చంద్రశేఖర్, ఓయూ వీసీ శిరందాస్, రామచంద్రం, విద్యాశాఖ సెక్రెటరీ డా.జనార్దన్ రెడ్డి, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, ఓఎస్డీి టి.కష్ణరావు, కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్, వై.పార్థసారథి, డా.సి.శ్రీనివాసులు, సుజాత తదితరులు పాల్గొన్నారు.