Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగన్, కేసీఆర్ల సమాలోచనలు
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ ఏపీ సీఎంకు ఆహ్వానం : అమరావతికి వెళ్లి స్వయంగా కలిసిన కేసీఆర్
- ఆర్టీసీ, విద్యుత్ సంస్థల విభజనపైనా చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాలపై కోర్టులు, ట్రిబ్యునళ్లకు వెళ్లకుండా మనమే సామరస్యపూర్వ కంగా పరిష్కరించుకుందాం' అని తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్లు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల విభజన లాంటి అంశాలపైనా వారు చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్యనున్న బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించాలనే అభిప్రాయానికి వారు వచ్చారు. ఈనెల 21న నిర్వహించబోయే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ కేసీఆర్.. జగన్ను ఆహ్వానించారు. ఇందుకోసం ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి అమరావతికి వెళ్లారు. జగన్ను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు సీఎంలూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై వారు చర్చించారు. ఆర్టీసీ ఆస్తుల పంపకాలు, జల వివాదాలు తదితర ముఖ్య అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఈనెల 24న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యద ర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్లో జరగనుంది. ఈ భేటీలో జలవివాదాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించాలని ఇరువురు సీఎంలూ నిర్ణయించినట్టు సమాచారం. జగన్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ వినోద్కుమార్ తదితరులున్నారు. అనంతరం జగన్, కేసీఆర్లు గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని కలిశారు. అనంతరం కేసీఆర్.. హైదరాబాద్కు తిరిగొచ్చారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకు ప్రారంభోత్సవం...
శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం హైదరాబాద ్లోని హైదర్గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం క్వార్టర్లలో కలియదిరిగి వాటిని పరిశీలించారు.