Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎడ్సెట్-2019 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎడ్సెట్ కన్వీనర్ మృణాళిని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎడ్ సెట్ ఫలితాలు బుధవారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్లోని ఉన్న త విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తా మని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్ రామచంద్రం విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఎడ్సెట్ రాతప రీక్ష మే 31న ఆన్లైన్ లో జరిగిన విషయం తెలిసిందే. 43,113 మంది అభ్య ర్థులు ఎడ్సెట్ రాతపరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను http://edcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు.