Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎక్కువ మంది జీవనంతో ముడిపడి ఉండే పల్లెలు అభివద్ధితో వికసించాలని, అది అధికారుల మెరుగైన పనితీరుతోనే సాధ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, మిషన్ భగీరథ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెల అభివద్ధిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివద్ధి అధికారులది కీలకపాత్ర అని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు , ఈవోపీఅర్డీ సంఘాల ప్రతినిధులు వేర్వురుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మంగళవారం కలిశారు. పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, గ్రామాల్లోని చాలా అంశాలు ఈ శాఖ పరిధిలోనే ఉంటాయన్నారు. పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వంలో మంచి అభిప్రాయం ఉందన్నారు. వీలైనన్ని ఎక్కువ గ్రామాలను సందర్శించి, సమస్యలపై కిందిస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అభివద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అధికారులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు, ఇతర అంశాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉంటుందని భరోసానిచ్చారు. డీపీవో సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి వేల మంది కార్యదర్శులను నియమించి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తొమ్మిది జిల్లాలకు మాత్రమే డిసీవోలు ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షులు పద్మజ, కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవోపీఆర్డీలు సైతం పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతిపత్రం ఇచ్చారు. 'చాలా కాలంగా బదిలీలు జరగాల్సి ఉంది. వీటిని వెంటనే పూర్తి చేయాలి. 2018లో ప్రభుత్వం బదిలీలు చేసినా సాధారణ ఎన్నికల కారణంగా పంచాయతీ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించలేదు. ఈవోపీఆర్డీలకు వెంటనే బదిలీల అవకాశం కల్పించాలి' అని కోరారు. ఈవోపీఆర్డీ సంఘం ఆధ్యక్షుడు రంగాచారి, కార్యదర్శి యాదగిరి గౌడ్, జి.శంకర్ తదితరులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.