Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని డీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీటీఎఫ్ అధ్యక్షులు ఎం రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేండ్లు గడుస్తున్నా 8,792 మంది టీఆర్టీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయడం సరైంది కాదని తెలిపారు. ఇంకోవైపు ఉద్యోగాలివ్వాలని ఆందోళన చేస్తున్న టీఆర్టీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు.