Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వట్టెం భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ కింద ఇచ్చిన పరిహారమే ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం ధర్మానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుపుతున్న సర్కారు 2013 చట్టం కింద పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నదని విమర్శించారు. భూ నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేసే విధానాన్ని ప్రభుత్వం మాను కోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులు అభివృద్ధి చెందుతారని ఆశిస్తే ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.