Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో వాదనలు పూర్తి
హైదరాబాద్: టీవీనైన్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు పూర్తికావడం తో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి ప్రకటించారు. బెయిల్ ఇవ్వరాదని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి చెప్పారు. మూడు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, ఫోర్జరీ కేసు కూడా ఉందని, రవిప్రకాశ్ 40 గంటలకుపైగా పోలీసుల విచారణకు హాజరైనా ఏమాత్రం సహరించలేదని చెప్పారు. మౌనంగా ఉండటం కూడా తనకున్న హక్కు అని ఆయన న్యాయవాది వాదించడాన్ని బట్టి రవిప్రకాశ్ పోలీసులకు సహరించలేదని స్పష్టమవుతుందన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాటాల్ని అమ్మినట్టు చూపించా రని చెప్పారు. వంద కోట్లకు పైగా ధర పలికే టీవీనైన్ లోగోను రూ.99లకే అమ్మేయడం అంతా ఒక పథకం ప్రకారం చేసినట్టు అర్ధం అవుతోందన్నారు. పైగా టీవీనైన్ వాటాల్ని అమ్మకాల డబ్బు హవాలా పద్ధతిలో అక్రమ మార్గంలో చేతులు మారాయనే రవిప్రకాశ్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రూ.500 కోట్లు చెల్లింపులు చేసి వాటాల్ని కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు.
బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ఏవిధమైన కఠిన షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదని రవిప్రకాశ్ తరఫు లాయర్ దిల్జీత్సింగ్ అహ్లూవాలియా అన్నారు. బెయిల్ ఇవ్వకపోతే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నా యనీ, ఒకసారి అరెస్ట్ అయితే ' యటకు రావడం కష్టమని చెప్పారు. కావాలనే కేసులు నమోదు చేశారనీ, మూడు ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశా రని, సుప్రీంకోర్టు సిబ్బియా కేసులో ఇచ్చిన తీర్పు ఇలాంటి కేసుల్లో ఎంతోకీలకంగా పరిగణిం చాలనీ, కావాలని కేసుల్లో ఇరికించినప్పుడు బెయిల్ ఇవ్వొచ్చునని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. టీవీనైన్ లోగో రవిప్రకాశ్దేనని, దానిని 15 ఏండ్లు వాడుకున్నందుకు రాబడిలో 4 శాతం వాటా ఇవ్వాలన్నారు. రవిప్రకాశ్కు చెందిన పది శాతం వాటాల్ని 2018 ఫిబ్రవరిలో విక్రయ ఒప్పందం చేసుకున్నారనీ, టీవీనైన్ వ్యవహారంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో మధ్యంతర ఆదేశాలు ఉన్నప్పటికీ వాటాలు చేతులు మారాయని చెప్పారు. నలుగురు డైరెక్టర్ల నియామకం చెల్లదన్నారు. రవిప్రకాశ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనీ, అదే టీవీనైన్ కొత్త యాజమాన్యం ఫిర్యాదు ఇచ్చిందే తడువుగా మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ప్రబుత్వం కావాలని వేధిస్తున్నదన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును తర్వాత చెబుతామని న్యాయమూర్తి వెల్లడించారు.