Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-ఓయూ
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ ఎలాంటి షరతులు లేకుండా నిరుద్యోగ భతి చెల్లించాలని కోరుతూ మంగళవారం ఉస్మానియా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ దయాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఓయూలో మరో ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. అలాగే, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కాంపెల్లి శ్రీనివాస్, ఆర్యన్ శంకర్, పీడీఎస్యూ నేతలు డి.రంజిత్, గడ్డం శ్యామ్, టీఎస్యూ కష్ణ మాదిగ, ఎస్ఎఫ్ఐ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.