Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చారిత్రక కట్టడం ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ భవనాలు కట్టాల్సిన అగత్యం తెలంగాణ సర్కార్కు ఎందుకు వచ్చిందో చెప్పాలని పలు ప్రజాహిత వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టగా, పిల్ దారుల తరపు న్యాయవాది నిరూప్రెడ్డి తన వాదనలను కొనసాగించారు. 150 ఏండ్ల నాటి ఎర్రమంజిల్ ప్యాలెస్ను ఎలా కూలుస్తారు? ఎర్రగడ్డ భవనాన్ని కూల్చరాదని హైకోర్టు చెప్పిన తర్వాతే ఎర్రమంజిల్ బిల్డింగ్ను తెలంగాణ సర్కార్ 2015లో హెరిటేజ్ లిస్ట్ నుంచి తొలగించింది. గతంలో కర్నాటకలో హెరిటేజ్ బిల్డింగ్ కూల్చేస్తామని అక్కడి సర్కార్ విధాన నిర్ణయం తీసుకుంది. అప్పుడు అక్కడి హైకోర్టు హెరిటేజ్ బిల్డింగ్లను కూల్చడం సమంజసం కాదని చెప్పడంతో ఆ ప్రయత్నం నుంచి కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒక చారిత్రక భవనాన్ని కూల్చి ఆ స్థలంలో కడతామంటే సరికాదని ఆయన వాదించారు. దీనిపై హైకోర్టు స్పందించి ఎర్రమంజిల్ బిల్డింగ్ కూల్చకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.