Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వ్యవసాయ ప్రణాళికను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, డీకే అరుణ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కరువు మండ లాలపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలని సూచించారు. రైతుల జాబితాను కేంద్రానికి పంపకపోవడం కిసాన్ సమ్మాన్ నిధి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల 25 లక్షల మంది రైతులు నష్టపోయారని వివరించారు. రైతాంగ సమస్యలను పరిష్కరిం చాలనీ, వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్లోని సచివాలయంలో సీఎస్ ఎస్.కే.జోషికి బీజేపీ రాష్ట్ర బృందం మంగళవారం వినతిపత్రం అందజేసింది.