Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి
హైదరాబాద్:రాష్ట్రంలోని మం డల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఎస్జీటీలు, భాషా పండితులుగా పనిచేస్తూ టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన ఉపాధ్యాయులకు వేతన రక్షణ కల్పిస్తామని విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. టీఆర్టీకి ఎంపికైన పంచాయతీరాజ్ ఉపా ధ్యాయులు ఆందోళన చెందుతు న్నారని, స్పష్టత ఇవ్వాలని యూఎస్పీసీ ప్రతినిధులు చావ రవి, వై అశోక్కుమార్, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్రెడ్డి, టి లింగారెడ్డి మంగళవారం కలిసి వివరణ కోరారు. దీనిపై జనార్ధన్రెడ్డి స్పందిస్తూ నిబంధనల ప్రకారం అవకాశం ఉంటు ందని చెప్పారు. అవసరమైతే ఇంకా స్పష్టత ఇస్తామని అన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.