Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 నెలల పెండింగ్ వేతనాలివ్వాలి : సీఐటీయూ
- సీజీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎస్ఎన్ఎల్ సం స్థను రక్షించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అసిస్టెంట్ సర్కిల్ రాష్ట్ర కార్యదర్శి జి.సాంబశివరావు, తెలంగాణ బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ అండ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిపూర్ణాచారి డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాంట్రాక్టు కార్మికులు హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ సీజీఎం కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ను దివాళా తీయిస్తూ జియో అనుకూల విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మూలంగా దేశవ్యాప్తంగా లక్షలాది కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు నేడు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి అనుమతులివ్వకుండా తొక్కిపెడుతూ జియోకి మేలుచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్కు ఆర్ధిక సహకారం చేయాలని, లేనిపక్షంలో అప్పులు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని అనేకసార్లు విన్నవించినప్పటికీ మోడీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్లో అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకుంటూ వారి పేర్లు రికార్డుల్లో లేకుండా బినామీ వ్యవస్థను ఏర్పాటు చేయటంతో ఎస్ఎస్ఎలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులకు కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ వ్యతిరేక జియో అనుకూల విధానాలను విడనాడాలని కోరారు. ధర్నా అనంతరం బీఎస్ఎన్ఎల్ తెలంగాణ జీఎంహెచ్ఎస్ సంజరుకుమార్, ఎస్టీఆర్పీజీఎం ప్రవీణ్కుమార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాంమూర్తి, సదానందం, నవీన్, సతీష్, వడ్నాల విజరు, ఓంప్రకాష్ జైశ్వాల్, శ్రీధర్, రమేష్, పరమేశ్వర్, ప్రసాద్, రమేష్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.