Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ
- జీవన ప్రమాణాల మెరుగుదలకు పోరాటం
- ప్రజల భావోద్వేగాలతో బీజేపీ, టీఆర్ఎస్ ఆటలు:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- కరీంనగర్ ప్రతినిధి
''ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, హక్కుల సాధన పోరాటాల వల్లే సాధ్యమవుతుంది. అందుకు యువజనోద్యమాలు నిర్మించేందుకు సమాయత్త మవుతున్నాం. మా పార్టీ సిద్ధాంత బలంతోనే యుద్ధం చేస్తుంది. అది మరో పార్టీకి లేదు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం'' సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో మంగళవారం యువజన సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజ ల భావోద్వేగాలతో ఆటలాడుతున్నాయని చెప్పారు. వాటిని అడ్డుగా పెట్టుకునే రెండోసారి అధికారంలోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, దాన్ని అధిగమించడానికి పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కోటి ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజ ేపీ.. ఉన్నవి ఊడగొట్టే ప్రయత్నంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సంస్కృతి పేర చరిత్రను తిరగరాసే ఫాసిస్టు పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ పేర రూ.27వేల కోట్లు అధికారికంగానే ఖర్చు చేశారని వివరించారు. అన్ని ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ఎన్ఐఏ చట్టం ద్వారా ఏ పౌరుడినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రిక స్వేచ్ఛకూ భంగం వాటిల్లుతున్న నేపథ్యం లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇచ్చిన విందును పాత్రికేయులు బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నాటకలో ఫిరాయింపు, డబ్బు రాజకీయాలపైనే ఫలితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. మూడు మాసాల్లో తెలంగాణలో టీఆర్ఎస్, బెంగాల్లో ప్రభుత్వం పడిపోతుందని ఏకంగా ప్రధాని మోడీ చేసిన బహిరంగ ప్రకటన కొనుగోలు రాజకీయాలకు అద్దంగా పడుతోందన్నారు. కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కుల హత్యలను ఖండించకపోవడం అందుకు ఉదాహరణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సాగు భూముల హక్కులను తుంగలో తొక్కి వారి గూడేలపై అటవీ అధికారులు, పోలీసులచే దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వామపక్షాలు బలహీనపడిన విషయం వాస్తవమే అయినా, ప్రజల నుంచి మాత్రం దూరం కాలేదని తెలిపారు. తెలంగాణపై ఎర్రజెండా ప్రభావం ఉందని, దీంతో కాషాయ మూకలను అడ్డుకోవడం ఖాయమని చెప్పారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడి మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు వర్ణ వెంకట్రెడ్డి, సుంకరి సంపత్, బండారి శేఖర్, గుడికందుల సత్యం, ఎం.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.