Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో రూ.25వేల కోట్ల ఆర్డర్లు లక్ష్యం: బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా
నవతెలంగాణ - సిటీబ్యూరో
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మూడో తరం క్షిపణులను తయారు చేస్తున్నట్టు చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమాండర్(రిటైర్డ్) సిద్ధార్థ్ మిశ్రా తెలిపారు. ఇతర సంస్థలతో కలిసి 4వ, 5వ తరం మిసైల్స్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశ సేవలో గోల్డెన్ జూబ్లీ (50 ఏండ్లు) ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ కంచన్బాగ్ బీడీఎల్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మిశ్రా మాట్లాడుతూ.. రానున్న ఐదేండ్లలో సుమారు రూ.25వేల కోట్ల ఆర్డర్లు లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రూ.8వేల కోట్ల ఆర్డర్లు బుక్ అయినట్టు చెప్పారు. ఒక్క దేశానికి మాత్రం ఒక ఉత్పాదన ఎగుమతి చేస్తున్నట్టు తెలియజేశారు. మిగతా ఆర్డర్లన్నీ భారత సైన్యానికే అందిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుత ఆర్డర్లు 2023-24 ఏడాదికి పూర్తవుతాయన్నారు. తేలికపాటి టొర్పెడోస్, బరువైన టొర్పెడో, ఎటిజిఎన్, మిలాన్-యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల ఎగుమతికి అనుమతులు లభించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఓ స్నేహ పూర్వక దేశం నుంచి నాలుగు ఆర్డర్లు దక్కాయన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీిఆర్డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండిస్టీస్ (ఐఎఐ)తో కలిసి మల్టీరోల్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ఎంఆర్ఎస్ఎఎమ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీడీఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విషోరడ్స్ మిస్సైళ్ల తయారీ కోసం మహారాష్ట్ర అమరావతిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.300కోట్లతో దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. డీఆర్డీఓతో కలిసి క్యూఆర్ సమ్, ఆకాశ్ 1ఎస్, ఆకాశ్ ఎన్జీ, ఎంపట్గమ్, ఆస్త్ర మిస్సైళ్లతో పాటు నేవిగేషన్ పరికరం సోనోబైయోస్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం బీడీఎల్ గోల్డెన్ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ నారాయణ, డైరెక్టర్(టెక్నికల్) ఎన్పి దివాకర్, డైరెక్టర్( ప్రొడక్షన్) రాధాక్రిష్ణ పాల్గొన్నారు.