Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ మహాసభల పోస్టర్ ఆవిష్కరణలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, కార్యదర్శి కోట రమేష్ తెలిపారు. మంగళవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 3వ మహాసభలను ఆగస్టు 2,3,4వ తేదీలలో వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభల్లో 31 జిల్లాల నుంచి, అన్ని విశ్వవిద్యాలయాల నుంచి దాదాపు 700 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. అనేక మంది విద్యావేత్తలు, ప్రజాతంత్రవాదులు హాజరౌతారన్నారు.
ప్రస్తుతం దేశ, రాష్ట్ర విద్యారంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చ జరుగుతుందన్నారు. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాల సాధనకై దేశవ్యాప్తంగా సమరశీల విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తున్న అతి పెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
కేంద్రంలో బీజేపీ విద్య కాషాయికరణ విధానాలను, ప్రభుత్వ బడుల మూసివేతను ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవి, ప్రకాశ్ కారత్, ఆర్.సంతోష్లతో పాటు శశాంక్, హష్మిబాబు తదితరులు పాల్గొన్నారు.