Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టౌన్ ప్లానింగ్ కోసం ప్రత్యేక పాలసీ
- డీటీసీపీ అధికారాలు కోత
- కలెక్టర్లకు పెరగనున్న బాధ్యతలు
- పకడ్బందీగా కొత్త మున్సిపల్ చట్టం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం పకడ్బందీగా రూపొందిస్తున్న కొత్త పురపాలక ముసాయిదాలో పలు కీలక అంశాలను చేర్చారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవులకు ఒకసారి నిర్ణయించే రిజర్వేషన్లను పదేండ్ల పాటు వర్తించేలా నూతన చట్టాన్ని రూపొందించినట్టు సమాచారం. వార్డుల పునర్విభజన, కులగణన పూర్తయినప్పటికీ మున్సిపల్ రిజర్వేషన్లను ఖరారు చేయకపోవడానికి కూడా నూతన చట్టంలో మార్పులుండడమే కారణమని అధికార వర్గాల ద్వారా తెలిసింది. రిజర్వేషన్లను నిర్ణయించేందుకు తీసుకునే ప్రమాణాల విషయంలో మరింత శాస్త్రీయంగా ఉండేందుకు కొద్ది మేర మార్పులు జరిగినట్టు చర్చ జరుగుతున్నది. అవినీతిని అరికట్టేందుకు వివిధ పనులను పూర్తి చేసేందుకు కాలపరిమితి నిర్ణయించడం, పౌరుల పనులను కూడా పూర్తి చేసేందుకు వ్యవధి నిర్ణయించనున్నారు. గృహ నిర్మాణ అనుమతులు పొందేందుకు ఉన్న విధానాలను మరింత సులభతరంగా మార్చనున్నారు. ఆన్లైన్ లోనే దరఖాస్తు మొదలు అనుమతి మంజూరు వరకు వీలయ్యేలా చట్టంలో పొందుపరుస్తున్నారు. ఆ దరఖాస్తులను ఏ
అధికారి ఎంత సమయంలోపు క్లిర్ చేయాలనే దానిపై నూతన చట్టంలో స్పష్టతనివ్వనున్నారు. పరిశ్రమల్లో సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నట్టుగానే దాదాపు ఈ విధానం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అనుమతికి నిర్ణయించిన సమయంలోపు తిరస్కరించకున్నా, అనుమతి ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపై చర్యలు. జరిమానా విధించనున్నారు. అదే విధంగా పచ్చదనం, సుందరీకరణ పనుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను, కాలనీ సంఘాలను భాగస్వాములను చేయడం తప్పనిసరి. పనులు సకాలంలో చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులనే కాకుండా ప్రజా ప్రతినిదులపై కూడా చర్యలు తీసుకునే విధంగా నూతన చట్టం అనుమతించనుంది. మున్సిపాల్టీల అభివద్ధిలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించేలా వారి అధికారాలను పెంచనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు విఫలమైనా, ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వహించినా అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు అధికారాలు దఖలు కానున్నాయని తెలుస్తున్నది.
తగ్గనున్న డీటీసీపీ అదికారాలు
పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న క్రమంలో టౌన్ ప్లానింగ్ కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకాలం మున్సిపల్ చట్టాల్లో భాగంగా ఉంటూ వచ్చిన టౌన్ ప్లానింగ్ విస్త తి పెరిగిన దాన్ని దష్టిలో ఉంచుకని దీని కోసం ప్రత్యేకంగా చట్టం ఉండాలని ప్రభుత్వం భావించింది. తొలుత మున్సిపల్ కోసం నూతన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అధికారులతో జరిపిన చర్చల్లో పట్టణాలు క్రమమైన పద్దతిలో విస్తరించేందుకు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ చట్టం అవసరాన్ని గుర్తించింది. దీంతో ఈ చట్టం రూపకల్పన కోసం డీటీపీసీ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. నూతన టౌన్ ప్లానింగ్ చట్టం పెరుగుతున్న పట్టణీకరణతో పాటు ఎదురవుతున్న సమస్యలను, భవిష్యత్ విస్తరణను దష్టిలో ఉంచుకొని రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మున్సిపల్ చట్టాన్ని ఆమోదించనున్న శాసనసభ ప్రత్యేక సమావేశాల్లోనే టౌన్ ప్లానింగ్ చట్టాన్ని కూడా ఆమోదింపజేసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే నూతన టౌన్ ప్లానింగ్ చట్టానికి సంబంధించి ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీపీసీ)కి ఉన్న అధికారాలను కుదించి కేవలం పరిశీలనకే పరిమితం చేయనున్నారు. లే అవుట్, భవన నిర్మాణం, భూవినియోగ మార్పు (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్ - సీఎల్ యూ), నిరభ్యంతర పత్రం జారీ (ఎన్ఓసీ), ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ తదితర అనుమతులిచ్చే అధికారులను కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించనున్నారని తెలియడంతో డీటీపీసీ అధికారులు ఒకింత అసంత ప్తితో ఉన్నారు.