Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్, బీజేపీ పోటీపడడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్యవిలువలకు ఆ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయని తెలిపారు. శాసనసభ, సచివాలయాన్ని వారసత్వ భవనాలుగా గుర్తించాలని కోర్టులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో భవనాలను కూలుస్తోందని పేర్కొన్నారు. చరిత్ర మరుగునపడే ప్రమాదముందని తెలిపారు.