Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలాలను రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో నెంబర్ 209, 210లను రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ గురువారం విడుదల చేశారు. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లో కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మం డలాలను చేర్చారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్లో కోరుట్ల, కథలా పూర్, మేడిపల్లి మండలాలు ఉంటాయి. 33 జిల్లాలతో కూడిన రాష్ట్రంలో కొత్త గా చేరిన రెండు రెవెన్యూ డివిజన్లతో కలిపి వాటి సంఖ్య 73కి చేరింది.