Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్తో భేటిలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏ లక్ష్యాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించామో అవి నెరవేరుతు న్నాయని సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో చెప్పారు. గురువారం శానససభ వాయిదా అనంతరం సీఎం నేరుగా రాజ్భవన్కు చేరుకుని గవర్నర్తో భేటీ అయ్యారు. కొత్త మున్సిపల్ చట్టంతో పాటు పాలనా సంస్కరణలు, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, పింఛన్ల పెంపు తదితర అంశాలను కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఈ సీజన్లో వర్షాలు ఆలస్యమైనా ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి ఏడు టీఎంసీలకు పైగా నీటిని అన్నారం బ్యారేజీకి తరలించామని చెప్పారు. గోదావరిలో నీటి ప్రవాహం పెరిగితే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని వివరించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన ఆయా అంశాల పురోగతిని కూడా కెసిఆర్, గవర్నర్ దష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. సకాలంలో వర్షాల్లేక ఖరీఫ్ సాగు ఆలస్యమైందని, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వ్యవసాయ శాఖ సిద్ధంచేసిందని తెలియజేశారు. ఆగస్టు మొదటి వారం వరకు పంటల సాగుకు అవకాశం ఉందని, ఈలోగా వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ అంచనా వేస్తోందన్నారు. పట్టణాలు, నగరాల సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలనే లక్ష్యంగా కొత్త పురపాలక చట్టాన్ని తీసుకొస్తున్నామని, దానికి సంబంధించిన బిల్లును గురువారం సభలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. నూతన చట్టం ఉద్దేశ్యాలు, లక్ష్యాలను కెసిఆర్ గవర్నర్కు వివరించారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం, గ్రామీణ విధా నాన్ని కూడా తీసుకొస్తున్నట్టు వివరించారు. ఎన్నికల హామీ మేరకు జూన్ మాసం నుంచి పెంచిన సామాజిక పింఛన్లను అందజేయాలని ఇటీవల మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నామని, ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు ఇస్తామన్నారు. వరుస వచ్చిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరిపాలనలో స్థబ్ధత వచ్చిందని, మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పా రు. సచివాలయం తరలింపు, ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్ నియా మకం తదితర విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. న