Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ బ్యూరో - హైదరాబాద్
పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్థినీలకు కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన, వరంగల్ జిల్లా హసన్పర్తి గ్రామానికి చెందిన అంజలీలకు సోమవారం బేగంపేట్లోని తన నివాసంలో వారి చదువులకు కావలసిన మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆర్థిక సహాయం పొందిన ఇద్దరు విద్యార్థినిలు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.