Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
హైదరాబాద్ కొండా పూర్లోని సీఆర్ ఫౌండేషన్లో బుధవారం మృతిచెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, స్వాతంత్య్ర సమర యోధుడు జాలాది వెంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. స్మారక సభ గచ్చిబౌలిలో జరిగింది. అంతకు ముందు వెంకటేశ్వరరావు భౌతికకాయం వద్ద సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు పూలమాలలు వేసి, ఎర్రజెండా కప్పి నివాళి అర్పించారు. స్మారక సభలో ఆయన మాట్లాడుతూ.. జాలాది లాంటి పోరాట యోధులు దూరమవ్వడం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విజయ ఎలక్టికల్స్ అధినేత దాసరి జయ రమేష్, చెన్నుపాటి చంద్రశేఖర్రావు, సూరపనేని జితిన్ ప్రసాద్, ట్రేడ్ యూనియన్ నాయకులు మల్లికార్జున్, నాయకులు టి.ఎన్.వి రమణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.