Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ఎద్దులు, 13 మేకలు మృత్యువాత
- రైతుల కుటుంబాల్లో తీరని విషాదం
నవతెలంగాణ-బూర్గంపాడు, టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో పిడుగుపడి ముగ్గురు ప్రాణం కోల్పోయారు. రైతులు చేలల్లో పనుల్లో ఉండగా ఈ ఘటనలు జరిగాయి. రెండు దుక్కిటెడ్లు, పది మేకలు మృత్యువాత పడ్డా యి. బూర్గంపాడు మండలంలో గురువారం మధ్యాహ్న సమయంలో గంటపాటు ఉరుములు మెరుపులతో వాన కురిసింది. ఆ సమయంలో పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన రైతు దోమల సుందర్(46) పత్తి చేలో నాగలితో దుక్కి దున్ను తున్నాడు. అప్పుడు పిడుగు పడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం ఏర్పడింది. ఇదే మండలంలో పాత పినపాక పంటపొలాల్లో పిడుగుపాటుతో 13 మేకలు మృత్యువా తపడ్డాయి. టేకులపల్లి మండల పరిధిలోని కొప్పురాయి పంచాయతీలోని కొత్తూరు గ్రామానికి చెందిన యల్లబోయిన రవళి(23), రవి దంపతులు బర్లగూడెంలో భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. పత్తి చేనులో కలుపు తీస్తుండగా వర్షం రావడంతో సమీపంలో ఉన్న చెట్టు వద్దకు రవళి, మరొక చెట్టు కిందకు రవి, వారి 9 నెలల పాప, మరో మహిళ మోకాళ్ల వీరమ్మ వెళ్లారు. కొద్దిసేపట్లోనే చెట్టుపై పిడుగు పడటంతో రవళి అక్కడిక్కడే మృతిచెందింది. మరొక చెట్టుకింద ఉన్న మోకాళ్ల వీరమ్మకు కాళ్లు సచ్చుపడిపోయాయి. ఆమెను చికిత్స నిమిత్తం కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. ఇదే మండలంలోని కొప్పురాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం సమీపంలో బండా అనూష(25) భర్తతో కలిసి పత్తి చేనులో కలుపు తీస్తుండగా పిడుగుపడి. అనూష అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది.