Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ప్రేక్షకులుగా ఉండిపోవాలా..? : భట్టి
- సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ శాసనసభ నుంచి గురువారం వాకౌట్ చేసింది. అధికార పక్షం తమగొంతు నొక్కు తున్నదనీ, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదనీ ఆ పార్టీ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క వాపోయారు. శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ సం దర్భంగా భట్టి మాట్లాడారు. అవకాశం వచ్చి నప్పుడల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాక్కోవటాన్ని విమర్శిస్తూ మాట్లాడేం దుకు ప్రయత్నించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ స్పీకర్ పోచారం శ్రీని వాసరెడ్డి భట్టికి మాట్లాడే అవకాశమి వ్వలేదు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ జరిగినంతసేపు తమ తమ స్థానాల్లో లేచి నిలబడే ఉన్నారు. సేవ్ డెమోక్రసీ అని రాసున్న ఫ్లకార్డులను వారు ఈ సందర్భంగా ప్రదర్శించారు. సభలో అధికార పక్షం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నదని భట్టి ఈ సందర్భంగా విమర్శించారు. 'మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా..? మేం సభకు వచ్చింది మీరు చేప్పేవి వినడానికేనా..? కేవలం మేం ప్రేక్షకులుగా ఉండిపోవాలా..? అంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు. అనంతరం స్పీకర్, అధికార పక్షం తీరుకు నిరసనగా భట్టితోపాటు కాంగ్రెస్ సభ్యులైన శ్రీధర్బాబు, సీతక్క, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆయన రూటే సపరేటు...
అసెంబ్లీలో రాజగోపాల్రెడ్డి తీరుపై చర్చోపచర్చలు నిరసన, వాకౌట్ లేని వైనం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూటే.. సపరేటులాగుంది. గురువారం శాసనసభలో ఆయన వ్యవహరించిన తీరు అటు సొంత పార్టీ నేతలతోపాటు, ఇటు జర్నలిస్టులకూ ఆశ్చర్యం కలిగించింది. గత కొన్ని నెలలుగా ఆయన కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అదే సమయంలో రాజగోపాల్ బీజేపీలోకి వెళతారనే వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై అడపాదడపా ఆయన మాట్లాడుతున్నారు తప్పితే.. స్పష్టత మాత్రం ఇవ్వటం లేదు. దీంతో ఆయన పరిస్థితి గోడ మీది పిల్లి వాటంలాగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా ఆయన శాసనసభలో వ్యవ హరించిన తీరు మరిన్ని విమర్శలకు తావిచ్చింది. పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్ వైఖరిని ఎండగడు తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతుం డగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మైక్ను కట్ చేశారు. దీనికి నిరసనగా మిగతా కాంగ్రెస్ సభ్యుల సభ జరుగుతున్నంత సేపూ లేచి నిలబడే ఉన్నారు. కానీ రాజగోపాల్రెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. తన స్థానంలో గమ్మున కూర్చుండిపో యారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులం దరూ సభ నుంచి వాకౌట్ చేశారు. అప్పుడు కూడా ఆయన వారిని అనుసరించలేదు సరికదా.. సభ అయిపోయే దాకా లోపలే ఉండిపోవటం గమనార్హం.
పలువురి మరణంపట్ల సంతాపం...
పలువురు మాజీ శాసనసభ్యుల మరణంపట్ల శాసనసభ సంతాపాన్ని ప్రకటించింది. బొమ్మా వెంకటేశ్వర్ (ఇందుర్తి), డెల్లా గాడ్ ఫ్రే (ఆంగ్లో ఇండియన్), కనకారెడ్డి (మల్కాజ్గిరి), బండారి శారారాణి (పరకాల), గట్టు భీముడు (గద్వాల), ఎ.కృష్ణమూర్తి (కామారెడ్డి) మరణంపట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ స్పీకర్ పోచారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.