Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా మీద ఏడుపా?.. కాంగ్రెస్కు ఆకర్షణ డౌన్
- నిబంధనలకు లోబడే వ్యవహారాలు : సీఎం కేసీఆర్
- అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టికి చురకలు
నవతెంగాణ బ్యూరో - హైదరాబాద్
వాస్తవమేననీ.. అయితే దానికి తామేం చేస్తామని ప్రశ్నించారు. అంతమాత్రం చేత కాంగ్రెస్ నేతలు.. ఇక్కడే దో భయంకరమైన ప్రమాదం జరిగినట్టు, రాజ్యాంగ ఉల్లం ఘన జరిగినట్టు మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నేతలు.. టీఆర్ ఎస్పై అనేక ఆరోపణలు, విమర్శలూ చేశారని, అయినా ప్రజలు తమకే పట్టం గట్టారని చెప్పారు. ఓటమిని జీర్ణిం చుకోలేని కాంగ్రెస్ నాయకులు.. ఈవీఎమ్ల్లో గోల్మాల్ జరిగిందంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఆ తర్వాత వరసగా జరిగిన పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిందని సీఎం అన్నారు. అవన్నీ బ్యాలెట్ పేపర్తో జరిగిన ఎన్నికలు కావా..? అంటూ ఆయన భట్టికి చురకలంటించారు.
త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్...
త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్తో ప్రజల ముందుకు వస్తామని సీఎం సభలో చెప్పారు. బోధనా వైద్యుల (ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితరులు) ఉద్యోగవిర మణ వయస్సుకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో సమాధానాలిస్తామని చెప్పారు.
5 వేల పైచిలుకు పరిపాలనా విభాగాలు..
తమ ప్రభుత్వ హయాంలో గత ఐదేండ్లలో పరిపాల నాపరంగా అనేక విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని సీఎం చెప్పారు. 33 జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల సంఖ్యను 142కు పెంచామనీ, ఆ ప్రకారంగా చూస్తే నూతన పంచాయతీలతో కలిపి మొత్తం 5 వేల పై చిలుకు పరిపాలనా విభాగాలను ఏర్పా టు చేశామని తెలిపారు. ఇంత చేసినా ప్రగతి నిరోధక శక్తులు.. తమకు అడ్డంకులు సృష్టిస్తూ, కోర్టుల్లో కేసులు వేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్తోపాటు మున్పి పాల్టీలు, కార్పొరేషన్ల చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువు లోగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందున.. ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పారు.
నిపుణులతో మాట్లాడే నిర్ణయం..
రాష్ట్రంలోని రైతు, వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞులతో మాట్లాడిన తర్వాతే రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నియామకంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. తొలుత ఈ స్థానాన్ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితోనే భర్తీ చేయాలని భావించామని అన్నారు. అయితే నిపుణులతో మాట్లాడిన తర్వాత విశ్రాంత జడ్జి కాకుండా అనుభవజ్ఞుడితో ఆ పోస్టున నింపేందుకు నిర్ణయించామని తెలిపారు. రైతుబంధు పథకం, ఎత్తిపోతల పథకాల మీద అవగాహన లేని వారు, మిడిమిడి జ్ఞానమున్న వారు ఏదేదో మాట్లాడుతున్నారని సీఎం ఈ సందర్భంగా విమర్శించారు. రైతుల కోసం రూ.10 వేల కోట్లు కాదు.. అవసరమైతే రూ.15 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. వారు అప్పుల నుంచి విముక్తులు కావటమేగాక.. ధనవంతులయ్యేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.