Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన
- కూంబింగ్ ఆపకపోతే దాడులు చేస్తాం
నవతెలంగాణ- తాడ్వాయి
దళాల సమాచారం పోలీసులకు చెప్పడంతో పాటు, 80 ఎకరాల భూమిని కబ్జా చేసినందుకే చర్ల ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్ను హతమార్చాల్సి వచ్చిందనిమావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 26వ తేదీన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కౌశెట్టివాయి గ్రామ శివారులోని వలస ఆదివాసీల పెరకగూడెం గ్రామంపై పోలీసులు దాడులు చేశారన్నారు. వారి గుడిసెలను, సామగ్రిని ధ్వంసం చేసి అక్కడ గూడెమే లేకుండా చేశారని పేర్కొన్నారు. పోలీసు శాఖ, అటవీ శాఖ దాడులు ఆపకపోతే టీఆర్ఎస్ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రకటనలో హెచ్చరించారు. హరితహారం పేరుతో ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేయడాన్ని కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలన్నారు. అక్రమ అరెస్టులు, కూబింగ్లు ఆపేయకపోతే టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయకతప్పదని ప్రకటనలో హెచ్చరించారు.