Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :బీహార్లో గో సంరక్షణ సమితి ముసుగులో దళిత, మైనారిటీ వర్గానికి చెందిన ముగ్గురు యువకులను దారుణంగా కొట్టి చంపటాన్ని ఆవాజ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన మూకోన్మాదులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మూక హత్యల వ్యతిరేక చట్టాన్ని పార్లమెంటు లో ఆమోదింపజేయాలని కేంద్రానికి వారు విజ్ఞప్తి చేశారు.