Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ను కిషన్రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారు కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ను మారుస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. గవర్నర్ను కిషన్రెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.