Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్ఫ్ఫైనాన్స్ కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్
- ఉన్నత విద్యామండలి వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్పైనాన్స్, నాన్ సాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల సెల్ఫ్ఫైనాన్స్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి చాంబర్ వద్ద బైటాయించి నిరసన చేపట్టారు. న్యాయం చేయాలని, వివక్ష చూపొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు చిట్యాల రాజు మాట్లాడుతూ జీవో నెంబర్ 11 విడుదలై 15 నెలలు గడుస్తున్నా సెల్ఫ్ఫైనాన్స్, నాన్ సాంక్షన్ పోస్టులని విడదీయడం అన్యాయమని విమర్శించారు. రెగ్యులర్ కోర్సుల్లో సాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకే జీవో నెంబర్ 11ను వర్తింపచేసి, తమను పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఏడాది కాలంగా తమకు పాత జీతాలే వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 1,500 మందికిపైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వారిలో 900 మందికి జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు పెంచి, మిగిలిన 600 మందిని విస్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమపై పక్షపాత ధోరణిని ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమకూ జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు పెంచాలని కోరా రు. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ఫైనాన్స్, నాన్ సాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు కమలాకర్, విజరు, వెంకటేష్, వేణుగోపాల్, శ్రీలక్ష్మి, రాజ్కుమార్, కవిత, స్వప్న, కిరణ్, సురేష్ పాల్గొన్నారు.