Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం పెంచాలని డిమాండ్ల
నవతెలంగాణ-యంత్రాంగం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. కనీసం వేతనం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ ఎంఈఓ కార్యాలయం ఎదుట సుమారు గంటపాటు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్కుమార్, మధ్యాహ్న భోజన కార్మికులు అంజలి హల్దార్, సత్యవతి, బీనా హల్దార్ పాల్గొన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు రెండోరోజు రిలే దీక్ష చేశారు. సీఐటీయూ జిల్లా కో కన్వీనర్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ కనీస వేతనంగా 18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు అవసరమైన సరుకులను ప్రభుత్వమే అందించాలనీ, పెండింగ్ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలనీ కోరారు. పాఠశాలలో తాగునీరు, వంటషెడ్లు నిర్మించాలన్నారు. ప్రభుత్వం కార్మికులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దీక్ష చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎంఈఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ దీక్షలో పాల్గొన్నారు.