Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- మాట్లాడేందుకే పిలిపించాం : ఇన్చార్జి డీఎస్పీ సత్యనారాయణ
నవతెలంగాణ - కాగజ్నగర్
మావోయిస్టులకు అన్నం పెట్టి, వారికి సహకరిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శనివారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండ లం మొర్లిగూడలో జరిగింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. మొర్లిగూడ గ్రామానికి చెందిన గొడె సత్తయ్య అలియాస్ సత్తు(40) గతంలో మావోయిస్టు సానుభూ తిపరునిగా పనిచేశాడు. అప్పట్లో అతనిపై పలు కేసులు నమోద య్యాయి. తదనంతరం కాలంలో ఆయన తన ఐదెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట సత్తయ్యను పెంచికల్పేట్ ఎస్ఐ రమేష్ పోలీసుస్టేషన్కు పిలిపించి మావోయిస్టులకు అన్నం పెడుతున్నావా అంటూ ప్రశ్నించాడు. తాను పిలిచినపుడల్లా పోలీసుస్టేషన్కు రావాలంటూ చెప్పి పంపించాడు. శనివారం ఫోన్చేసి ఆదివారం మళ్లీ పోలీసుస్టేషన్కు రావాలని చెప్పడంతో మనస్తాపం చెందిన సత్తయ్య శనివారం ఉదయం ఇంట్లో పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబీకులు కాగజ్నగర్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకుపో యారు. బాధితుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తమకు ప్రసుత్తం మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేకున్నా పోలీసులు తన భర్తను అనుమానిస్తూ తరచుగా పోలీసుస్టేషన్కు పిలిపిస్తున్నారని సత్తయ్య భార్య ఆవేదన వ్యక్తం చేసింది. అందువల్లే మనస్తాపం చెంది తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని విలేకరులకు వివరించింది.
మాట్లాడేందుకే..: సత్యనారాయణ, ఇన్ఛార్జి డీఎస్పీ- కాగజ్నగర్
గొడె సత్తయ్యను మాట్లాడేందుకు మాత్రమే ఎస్ఐ పోలీసుస్టేషన్కు పిలిపించారు. మావోయిస్టు దళం సంచరిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు గతంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులను పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో సత్తయ్యను కూడా పిలిపించాం. అతన్ని కొట్టడం, తిట్టడం చేయలేదు. కుటుంబంలో తగాదాల కారణంగా అతను ఆత్మహత్యాయత్నం చేసినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. దీనిపై విచారణ చేపడుతున్నాం. ఆత్మహత్యాయత్నం చేసినందుకు సత్తయ్యపై కేసు నమోదు చేశాం.