Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎండీఏ దృష్టి
- పచ్చదనంతోపాటు కాలుష్య నివారణకు చర్యలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
కాంక్రీటు అరణ్యాలు పెరిగి అడవులు మాయమౌతు న్నాయి. మనిషి అవసరాల కోసం ప్రకృతి వనరులపై జరు గుతున్న విధ్వంసం వినాశనానికి దారి తీస్తోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఫ్యాక్టరీలు, కార్ఖానాలు, వాహనాల పొగతో కాలుష్యం రికార్డు స్థాయిని మించిపోతోంది. ఈ క్రమంలో అడవులతోపాటే జీవజాతులు అంతరించిపోతు న్నాయి. దాంతో కొంతలో కొంతైనా అడవులను రక్షించి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ పార్కుల్లో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికారులు పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కబ్జాదా రుల నుంచి రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు. దీని పరిధిలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చ ల్, సంగారెడ్డి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో 16 బ్లాకులుగా ఎంపిక చేశారు. తద్వారా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలను అటవీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చర్యలు చేపట్టారు. సందర్శకులు సేద తీరేలా శివారు ప్రాంతాల్లో మొక్కల పెంపకంతోపాటు, అటవీ భూముల్లో పార్కులు అభివృద్ధి చేసి, వాటికి అందమైన గేట్లు, ఆర్చ్లను ఏర్పాటు చేస్తున్నారు.
95కోట్లతో అభివృద్ధి
రంగారెడ్డి పరిధిలో కమ్మధాన్, సిరిగిరిపూర్, పల్లెగడ్డ, మణ్యంకంచా, నాగారం, మైసారం, శ్రీనగర్, పడమటికం చెతో పాటు పలుప్రాంతాలు, యాదాద్రిలో కొండమడుగు, జలాల్పూర్, బీబీనగర్, మెదక్ పరిధిలో వడియారం, మనోహరాబాద్, పరికబండ, మేడ్చల్ల్లో తుర్కపల్లి, సంగారెడ్డిలో సంగారెడ్డి క్లాస్ట్ బొంతపల్లి, జిన్నారం, మంగపేట్, నాగవరం, పాలెం, రావళ్లపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
5928 హెక్టార్లు
శివారు ప్రాంతాల్లో దాదాపు రూ.95కోట్లతో 5928. 38 హెక్టార్ల విస్తీర్ణంలో 16 బ్లాక్లను టూరిస్ట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ అధికారులు నగర శివారుల్లో భారీగా మొక్కలు పెంచను న్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లా వడియారం, మనోహరాబాద్ ప్రాంతాల్లో మాత్రమే చదును చేసే పనులు చేపట్టారు. ఒక్కో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ పార్కు విస్తీర్ణంలో 80 శాతం నుంచి 85 శాతం కన్జర్వేషన్ జోన్గాను, 15 నుంచి 20 శాతం సందర్శకుల జోన్గా అభివృద్ధి చేసేలా హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
- కన్జర్వేషన్ జోన్లో అటవీ పెంపకం, భూసార పరిరక్షణ పనులు చేపడతారు.
- సందర్శకుల జోన్లో ప్రవేశద్వారం, వాల్స్, కాలినడక మార్గాలు, బైస్కిల్ ట్రాక్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
- సందర్శకులు సేద తీరేందుకు ఆకర్షణీయ కుటీరాలు, మంచినీరు, టాయిలెట్లు, పార్కింగ్ సౌకర్యంతోపాటు తదితరాలను అభివృద్ధి చేస్తారు.