Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 2 నుంచి వరంగల్లో
నవతెలంగాణ- పోచమ్మమైదాన్
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 3వ మహాసభ వాల్పోస్టర్ను ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో వరంగల్లోని రత్న హోటల్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు పింగిలి సంపత్రెడ్డి మాట్లాడుతూ.. మహాసభ ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు నగరంలో జరగనుందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతోందని చెప్పారు. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మహాసభను చారిత్రాత్మక నగరం వరంగల్లో నిర్వహించడం గర్వకారణం అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సంఘం అండగా నిలబడుతోందన్నారు. విద్యారంగంలో సంస్కరణలు, విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించడంపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు. మహాసభ జయప్రదానికి ప్రజాతంత్రవాదులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్, కోశాధికారి రాగుల రమేష్, ఆహ్వాన సంఘం కార్యదర్శి జి ప్రభాకర్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు టి.రఘు, ప్రకాశ్ పాల్గొన్నారు.