Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో డ్రైవర్
నవతెలంగాణ- శంకర్పల్లి
స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని వివేకానంద నగర్కాలనీలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రావూస్ పాఠశాల బస్సు డ్రైవర్ ఇబ్రహీం ఉదయం విద్యార్థులను తీసుకె ళ్లేందుకు వివేకానందనగర్ కాలనీకి వచ్చాడు. విద్యార్థులను తీసుకుని తిరిగి వెళ్లే సమయంలో.. కిరాణ దుకాణంలో చాక్లెట్లు తీసుకుని రోడ్డు దాటుతున్న మోసిన్పాషా కుమారై తాసిన్బేగం(2)ను ఢీకొట్టింది. కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని నగరంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. చిన్నారి కుటుంబీకులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.