Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజిస్ట్రేషన్ శాఖలో ఏడుగురికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో నెంబర్ 217ను జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్గా పనిచేస్తున్న పరిటా సుబ్బారావు డీఐజీగా ఉద్యోగోన్నతి పొందారు. గ్రేడ్ వన్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లుగా ప్రమోషన్ పొందారు. ఉద్యోగోన్నతి పొందినవారిలో స్థితప్రజ్ఞ, రవీంద్రరావు, తదితరులు ఉన్నారు.