Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోస్త్ కన్వీనర్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ఆప్షన్ల నమోదు గడు వు ఈనెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ ఆర్ లింబాద్రి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు మంగళవారంతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 26న ప్రత్యేక విడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 28,29 తేదీల్లో సీట్లు కేటాయిం చిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇంట్రా కాలేజీ (ఆకాలేజీలో మార్పుచేర్పులకు) ప్రక్రియ ఈనెల30న నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 31న వారికి సీట్లు కేటాయిస్తా మని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.