Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయం : మంత్రి ఎర్రబెల్లి
- దూలపల్లిలో నర్సరీ, ప్లాంటేషన్ నిర్వహణపై అధికారులకు శిక్షణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరితహారంలో నాటిన ప్రతి మొక్కా బతికేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. నర్సరీ, ప్లాంటేషన్ నిర్వహణపై హైదరాబాద్ సమీపంలోని దూలపల్లిలో గల ఫారెస్టు అకాడమీలో జిల్లాల అధికారులకు రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం మొదలైంది. అకాడమీ ఆవరణంలో మంత్రి మొక్కలను నాటారు. శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ''హరితహారం అంటే హడావుడిగా, మొక్కుబడిగా మొక్కలు నాటి వదిలేయడం కాదు. సంరక్షణ ముఖ్యం. ప్రజలను భాగస్వామ్యం చేయాలి. మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు తీసుకో వాలి. మొక్కల సంరక్షణ, పర్యవేక్షణ కోసం ఒక్కో గ్రామానికి ఒక్కో మండల అధికారికి అప్పగించాలి. నిర్లక్ష్యంగా వ్యవ హరించే వారికి ముందుగా హెచ్చరిక నోటీసులివ్వాలి. మారకుంటే చర్యలు తీసుకోవాలి. హరితహారంపై ఆసక్తి ఉన్న వారినే గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులుగా నియ మించేలా చర్యలు తీసుకుంటాం. హరితహారం, పరిశుభ్రత కోసం ఔత్సాహికులతో కమిటీలో వేయాలి. ఆయా గ్రామా ల్లోని ఎన్ఆర్ఐలను, వ్యాపారవేత్తలను, ఎన్జీవోలను హరిత హారంలో భాగస్వాములను చేయాలి. సీఎం కేసీఆర్ కోరుకున్న విధంగా మన రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలి. బెంగుళూరులోలాగా మొక్కల సంరక్షణ కోసం సర్కారు తుమ్మ చెట్లను పెంచాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి పి.కె.ఝా, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్, డీపీవో, ఈవోపీఆర్, ఎంపీడీవో, ఎఫ్ఆర్వో, ఏవో, హార్టికల్చర్ ఆఫీసర్, ఏపీవో, ప్లాంటేషన్ మేనేజర్లు, వన అధికారులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ పార్కు బాగుంది : మంత్రి ఎర్రబెల్లి
ఆక్సిజన్ పార్కు చాలా బాగుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి(పీసీపీఎఫ్) పి.కె.ఝా ఆహ్వానం మేరకు హైదరా బాద్ సమీపంలోని కండ్లకోయలో ఏర్పాటు చేసిన 90 ఎక రాల ఆక్సిజన్ పార్కును మంత్రి దయాకర్రావు సందర్శిం చారు. పక్షుల విభాగాన్ని ఆసక్తిగా పరిశీలించారు. వీక్షణకు వచ్చిన విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆక్సిజన్ పార్కు అభివృద్ధిని, ప్రణాళికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు పీసీపీఎఫ్ పి.కె.ఝా వివరించారు. వారి వెంట పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ ఉన్నారు.