Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
నవతెలంగాణ- గచ్చిబౌలి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్లో ఓ విద్యార్థిని బాత్రూమ్లో మృతిచెందింది. ఈ ఘటన సోమ వారం ఉదయం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. ఖరగ్పూర్ నగరానికి చెందిన దీపికా మహాపాత్ర(29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తోంది. ఈమె సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బాత్రూమ్లో పడిపోయి ఉండటాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే యాజమాన్యానికి సమాచారమందించారు. వెంటనే విద్యార్థినిని ఓ స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె మెడికల్ రికార్డులు, తోటి స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు ఆమెకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. అందువల్లే ఆమె బాత్రూమ్లో పడిపోయినట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.