Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
అప్పుల బాధ భరించలేక ఓ పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..సూరారం గ్రామానికి చెందిన రత్న బాపు(40) తన ఎకరన్నరతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్లో పత్తి సాగుచేశాడు. గతంలో సాగు నిమిత్తం మూడు బోర్లేయగా రెండింటిలో చుక్కనీరూ పడలేదు. సాగు, బోర్ల నిమిత్తం రూ.3.50లక్షల అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కానరాక బుధవారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని మహదేవపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. రత్నబాపుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.