Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అంతర్జాతీయ వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కార కేంద్రం (ఐసీఏడీఆర్) ద్వారా మిషన్ భగీరధ ఇంజనీర్లకు రెండు రోజుల శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తున్నట్టు ఆ కేంద్రం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు జెఎల్ఎన్ మూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతుల్లో ఇటీవల వచ్చిన సవరణలు అనే అంశంపై ఈ తరగతులు ఉంటాయని, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి వి నిరంజన్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో ఎర్రమంజిల్లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయ ప్రాంగణంలో ఈ తరగతులు జరుగుతాయి.