Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ఇండ్లల్లోకి కోతులు చొరబడకుండా ఎలాంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలియజేయాలని హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ జీహెచ్ఎంసీకి నోటీసులిచ్చారు. న్యూబోయిగూడకు చెందిన ఎంఎన్కె విట్టల్, పద్మారావు నగర్కు చెందిన రేణుక మరో ఇద్దరు దాఖలు చేసిన రిట్లను న్యాయమూర్తి విచారించారు. తమ ఇండ్లల్లోకి కోతులు వస్తున్నాయని అపార్ట్మెంట్ వద్ద ఇనుప గ్రిల్స్ పెట్టుకున్నందుకు మున్సిపల్ కార్పొరేషన్ తమకు నోటీసులి చ్చిందనీ, గ్రీల్స్ తొలగిస్తే కోతుల దాడుల నుంచి ఎవరు రక్షిస్తారని వారి తరపు న్యాయవాది వాదించారు.