Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్ను అమలు చేయాలని టీఆర్ఈఐఎస్ కార్యదర్శిని విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, టీఆర్ఈఐఎస్ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి సమక్షంలో తెలంగాణ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం నాయకులు రవిచందర్, విష్ణువర్ధన్రెడ్డి, సుబ్బారావు, రమణారెడ్డి, సుదర్శన్లతో జనార్ధన్రెడ్డి సమావేశమయ్యారు. వివిధ సమస్యల పరిష్కారానికి త్వరలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ (పాలకమండలి) సమావేశాన్ని మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేస్తామని జనార్ధన్రెడ్డి హామీ ఇచ్చారని సంఘం నాయకులు కె విష్ణువర్ధన్రెడ్డి, కె సుబ్బారావు తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పిల్లలకు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులిస్తామన్నారని పేర్కొన్నారు. మిగతా గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేసే నోటు పుస్తకాలు, ట్రాక్షూ, ట్రంక్బాక్స్, ప్లేట్లు, గ్లాసులు సాధారణ సొసైటీలోని విద్యార్థులకూ ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.