Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టపోయిన ప్రతి ఎకరాకూ రూ 20వేలు ఇవ్వాలి : తెెలంగాణ రైౖతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరదల వల్ల నష్టపోయిన రైతులను, కరువులతో నష్టపోయిన రైతుల గణాంకాలను సేకరించి ఎకరాకు ఈ రూ 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో మాదినేని రమేష్ అథ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యంగానైనా వర్షలు పడుతున్నదుకు ప్రభుత్వం పంటలపై ధీమా వ్యక్తం చేస్తుందని, వరదలు రావడంతో మంత్రులు హారతులు పడుతున్నారన్నారు. కరువు, వరదలతో నష్టపోయిన పంటల నష్టపరిహారంపై మాట్లాడటం లేదని విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్రలో పడిన వర్షాలు వల్ల కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయన్నారు. వరదల వల్ల లోయర్ జూరాల, దాని కింద నెట్టెంపాడు గ్రామంతో సహా మరో నాలుగు గ్రామాలు నీట మునిగి దళిత రైతులు నష్టపోతున్నారని చెప్పారు.
ఖరీఫ్లో 27 లక్షల ఎకరాలలో సాగు లేదన్నారు. సాగు చేసిన 113 లక్షల ఎకరాల్లో 30 లక్షల ఎకరాల్లో వేసిన విత్తనాలు ఎండిపోగా, రెండు,మూడు దఫాలుగా విత్తనాలువేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరువుల వల్ల పంటలు పండే అవకాశం కనబడటం లేదని, వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్వులు పి జంగారెడ్డి, టి సాగర్, జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.