Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్లో పట్టుకున్న పోలీసులు
- 8 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-శంషాబాద్
వ్యసనాలకు బానిసలుగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు శంషాబాద్ బస్స్టేషన్ పరిధిలో సంచరిస్తూ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారు. ఈ క్రమంలో బస్స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకోవడంతో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఐదుగరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మ బాను తేజరెడ్డి (20), దుబ్బాకుల సాయినరేష్ (21), కర్నాటే అఖిల్ (20), షేక్ నయీమ్ (20), డీకొండ సాయికుమార్ (20) రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలోని నలందానగర్లో ఉంటున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నలుగురు బానుతేజతో కలిశారు. అరకులోయ నుంచి కిలో రెండువేల రుపాయల చొప్పున పదహారు వేల రుపాయలు ఇచ్చి ఎనిమిది కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఈ నెల 16న భాను, సాయికుమార్ కలిసి శంషాబాద్ బస్టేషన్కు వచ్చారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ఉంచిన గంజాయిని విద్యార్థులకు అమ్ముతున్నారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు నిందితులను పట్టుకుని బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి కనిపించింది. వెంటనే ఇద్దర్ని అరెస్టు చేసి విచారించగా పూర్తి వివరాలు వెల్లడించారు. మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, ధనుంజయ, పైడి నాయుడు పాల్గొన్నారు. గతంలోనూ భానుతేజరెడ్డి జైలుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.