Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులకు సీఎస్ జోషి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను వెంటనే ఆర్ధికశాఖకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖల ఉన్న తాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, చిత్రారామచంద్రన్ , అధర్సిన్హా, సోమేష్కుమార్ , శాంతికుమారి, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్శర్మ, జయేష్రంజన్ , పార్ధసారథి , వికాస్రాజ్, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, జనార్ధన్రెడ్డి , బెన్హర్ మహేష్దత్ ఎక్కా , నిరంజన్రావు , వాణిజ్యపన్నులు, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ , వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ మాసంలో జరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనీ, శాఖలు వెంటనే తమ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతి శాఖ తమ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. అయా శాఖల అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖ మంత్రులతో సమీక్షా సమావేశాలు వెంటనే పూర్తిచేయాలని అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను, కేంద్ర బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. గత ఏడాది కేటాయింపులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖలు తమ అంచనాల ప్రకారం ఆదాయాల పెంపునకు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలని సూచించారు.