Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ధర్నా
నవతెలంగాణ-ముస్తాబాద్
పంట రుణాల వసూళ్లను వెంటనే ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ సహకార సంఘం ఎదుట రైతులు శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తీసుకున్న రుణం చెల్లించాలని పోత్గల్ సహకార సంఘం అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఒక వైపు మండలంలో కరువు తాండవం చేస్తుంటే, మరో వైపు పంట రుణాల బాకీ చెల్లించాలనడం సరికాదని అన్నారు. రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వెంటనే రుణమాపీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ యాకన్న అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బాల్రెడ్డి, బుర్ర రాములుగౌడ్, పెద్దిగారి శ్రీనివాస్, కృష్ణ, హరిబాబు, రాజయ్య పాల్గొన్నారు.