Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారానికి 1న చలో హైదరాబాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) చైర్మెన్గా జి సదానందంగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జాక్టో విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. జాక్టో సెక్రెటరీ జనరల్గా ఈ రఘునందన్, కోశాధికారిగా ఎం రాధాకృష్ణారావు, కో చైర్మెన్లుగా జి సోమయ్య, కె కృష్ణుడు, జయబాబు, ఎండి అలీంబాబా, కార్యదర్శులుగా వైఎస్ శర్మ, ఎస్ విఠల్లను ఎన్నుకున్నారు. అనంతరం జాక్టో చైర్మెన్ సదానందంగౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెల ఒకటిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయ గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో ఐఆర్, పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయస్సు పెంపు మాటే కరువైందని తెలిపారు.