Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక వీరుడు సర్వాయి పాపన్న: జయంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బహుజన రాజ్యాధికారం కోసం ప్రజల పక్షాన తొలి అడుగులు వేసిన సర్వాయి పాపన్నను చరిత్ర విస్మరించినా ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (టీ.కే.జీ.కే.ఎస్) ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సర్వాయి పాపన్న జయంతి జరిగింది. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, టీకేజీకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల జనార్థన్, మోదుగుపూల సంపాదకులు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజా సాంస్క తిక కేంద్రం కార్యదర్శి జి.రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ వీరోచిత పోరాటాలు చేసి కోటలు కట్టిన చరిత్ర సర్వాయి పాపన్నదన్నారు. ఆయనను ఆదర్శంగా వామపక్షాలు, బహుజనులు కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరముందన్నారు. కలిసి చేస్తున్న ఉద్యమాల్లో కొన్ని ఆటంకాలు వస్తున్నాయని, వాటిని అధిగమించి ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ జానపద కళాకారులు సర్వాయి పాపన్న చరిత్రను సజీవంగా ఉంచారన్నారు. బహుజనుల అస్థిత్వం కోసం పోరాడిన అనేక మంది వీరులను చరిత్ర లేకుండా చేయాలన్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. మౌఖిక సాహిత్యంతో తరతరాలకు వారి జీవిత విశేషాలను చేరవేశారన్నారు. పాపన్నతో పాటు ప్రజా వీరుల చరిత్ర దేశ ప్రజలకు తెలియాలని ఆకాంక్షించారు.. చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ నాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వ త్తిదారులను, సామాన్యులను తన అనుచరులుగా చేసుకొని పోరాడిన వీరుడు సర్వాయి అని కొనియాడారు. పేదలకు అనుకూలమైన పాలన కోసం సర్వాయి క షి చేశారన్నారు. పాపన్న లాంటి వీరుల చరిత్రను వెలికి తీస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రజా సాంస్క తిక కేంద్రం విశేష కషి చేస్తున్నదని అభినందించారు. జి.రాములు మాట్లాడుతూ సర్వాయి పాపన్న లాంటి బహుజన వీరుల చరిత్రను వెలికి తీస్తున్నామన్నారు.