Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావంత్తండా వద్ద భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పైపులైన్ గేట్వాల్ ఆదివారం లీకై నీళ్లుగా వృథాగా పోతున్నాయి. పాలేరు నియోజకవర్గ రైతులకు సాగునీరందించేందుకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా శనివారం స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి నీటి విడుదల చేశారు. పాలేరు రిజర్వాయర్ నుంచి ఇస్లావత్తండా వరకు వేసిన పైపులైన్కు అక్కడక్కడా గేట్వాల్స్ ఏర్పాటు చేశారు. ఇస్లావత్ తండా సమీప గేట్వాల్ను గుర్తుతెలియని వ్యక్తులు లీక్ చేశారు. దీంతో నీళ్లు భారీగా ఎగిసిపడి వృథాగా పోతున్నాయి. నేడు అక్కడ మరమ్మతు చేయిస్తామని డీఈ శ్రీనివాసరావు తెలిపారు. కావాలనే కొందరు లీక్ చేశారనీ, వారిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.